Friday, March 29, 2024
- Advertisement -

బాహుబలి2 కథను ఊహించి చెప్పారు!

- Advertisement -

బాహుబలి2 సినిమా గురించిన అంచనాలు రోజురోజుకీ ఆకాశాన్ని అంటుతున్నాయి. బాహుబలి వసూళ్ళ దెబ్బకి బాహుబలి2 విషయంలో రాజమౌళి టీమ్ మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది. భారీ అంచనాలున్న బాహుబలి2 సినిమాపై రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ తో కలసి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయన కూడా ఓ స్టార్ రైటర్ గా బాహుబలి2 కథను ఊహించి చెప్పారు. పరుచూరి గోపాలకృష్ణ చెప్పిన దాని ప్రకారం బాహుబలి2 లో హీరోయిన్ అనుష్కతో ప్రభాస్, రానా ఇద్దరూ ప్రేమలో పడతారని, అనుష్క వలన వారిద్దరి మధ్య ఉన్న అధికార పంతం శత్రుత్వంగా మారుతుంది అని అన్నారు.

ఇదే బాహుబలి తర్వాతి భాగం కథ అవుతుందని అనుకుంటున్నట్లుగా తెలియచేశారు. ఆస్తి కోసం, అమ్మాయిల కోసం పోరాడే కథాంశంతో వచ్చే చిత్రాలు ఎప్పుడూ హిట్ అవుతాయని అన్నారు. దీనికి విజయేంద్రప్రసాద్ స్పందిస్తూ, సస్పెన్స్ పోవాలంటే వచ్చే సంవత్సరం వరకూ ఆగాలని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -