Sunday, April 28, 2024
- Advertisement -

కన్ఫామ్‌..బాలయ్యతో కేటీఆర్ అన్‌స్టాపబుల్!

- Advertisement -

అన్‌స్టాపబుల్..నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న షో. ఇప్పటివరకు రెండు సీజన్లు పూర్తి చేసుకోగా తాజాగా మూడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. రెండు సీజన్లలో ఇప్పటివరకు తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఏ షోకి రాని రెస్పాన్స్‌ అన్‌స్టాపబుల్‌ షోకి వచ్చింది. తనదైన హాస్యం, డైలాగ్‌ డెలివరితో బాలయ్య గెస్ట్‌లను మెప్పించారు. నారా చంద్రబాబుతో పాటు పలువురు సినీ రంగానికి చెందిన వారు ఈ షోకి గెస్ట్‌లుగా వచ్చారు.

తాజాగా మూడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈసారి గత రెండు సీజన్ల కంటే భిన్నంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఓ వైపు పాలిటిక్స్‌, ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బాలయ్య అన్‌స్టాపబుల్ షో చేస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొనగా అన్ స్టాపబుల్ సీజన్ 3కి హోస్ట్‌గా చేసేందుకు బాలయ్య సైన్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక మూడో సీజన్‌ మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మంత్రి కేటిఆర్ వస్తారని ప్రచారం జరుగుతోంది. రాబోతుంది ఎలక్షన్ సీజన్ కావటం, చంద్రబాబు అరెస్ట్, రాజమండ్రి జైల్లో రిమాండ్‌లో ఉండటంతో ఈసారి పాలిటిక్స్‌ నేపథ్యంలో అన్‌స్టాపబుల్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే రీసెంట్‌గా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి బాలయ్య చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బాలయ్య – కేటీఆర్ ఎపిసోడ్‌పై ఎప్పుడు వస్తుందా అని అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మొత్తంగా బాలయ్య అన్‌స్టాపబుల్‌ మూడో సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -