జబర్దస్త్ షోలో తన కామెడీతో అదరగొడుతున్నాడు హైపర్ ఆది. ఈ మధ్య కాలంలో హైపర్ ఆది పేరు బాగా వినిపిస్తోంది. అయితే హైపర్ ఆది మీద నందమూరి నటసింహం బాలకృష్ణ కత్తి ఎత్తాడట. అంతేకాకుండా ఆదిని చంపుతామని వార్నింగ్ కూడా ఇచ్చాడు. మరి హైపర్ ఆది కి బాలయ్యకు మధ్య ఏం జరిగింది..? హైపర్ ఆదికి బాలయ్య ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది..? ఈ విషయం గురించి స్వయంగా ఆదినే చెప్పాడు. తాజాగా హైపర్ ఆది ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య తనకు వార్నింగ్ ఇచ్చిన విషయం చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.
ప్రస్తుతం జబర్దస్త్లో హైపర్ ఆదికి బాగా క్రేజ్ ఉంది. కానీ గతంలో ఆది అభి టీంలో మెంబర్గా ఉండేవాడు. ఇప్పుడు అదే అభి టీంకు పోటీగా మారాడు ఆది. ఆది అభి టీంలో ఉన్నప్పుడు దివంగత లెజెండ్రీ హీరో నందమూరి తారక రామారావుపై ఓ స్కిట్ చేశాడట. అందులో పొరపాటుగా ఎన్టీఆర్పై ఓ డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడట. ఈ సంగతి తెలుసుకున్న బాలయ్య.. తన పీఏ చేత ఆదికి ఫోన్ చేయించాడట.
బాలయ్య పీఏ ఆదితో బాలయ్య మిమ్మల్ని చంపమన్నాడు..చంపేయాలా అని అన్నాడట. దీంతో భయపడిపోయిన ఆది మరోసారి అలాంటి తప్పు చేయనని పీఏకు సారీ చెప్పాడట. తర్వాత బాలయ్య పీఏ కూడా సరదాగా అన్నానని చెప్పడంతో హైపర్ ఆది టెన్షన్ తగ్గిందట. ఈ సంఘటన తర్వాత హీరోలతో పాటు చనిపోయిన వారిపై స్కిట్లు, జోకులు వేయడం మానేసినట్టు చెప్పాడు. ఈ సంగతిన్ని స్వయంగా ఆదినే చెప్పడంతో అందరికి ఇప్పుడు తెలిసింది.
Related