Tuesday, May 21, 2024
- Advertisement -

అప్పుడు లౌక్యం, ఇప్పుడు రుద్రమదేవి – చరణ్ కి తలనొప్పిగా మారాయి

- Advertisement -

పోయిన సంవత్సరం కూడా ఇలాగే దసరా శలవుల అడ్వాంటేజ్ తీసుకుని కలెక్షన్స్ రాబడదాం అని బరిలోకి అడుగుపెట్టిన రాం చరణ్ గోవిందుడు అందరివాడేలే తో పరవాలేదు అనిపించే హిట్ కొట్టాడు . అప్పట్లో ఈ గోవిందుడు కి సరిగ్గా వారం రోజుల క్రితం లౌక్యం సినిమా విడుదల అయ్యింది , అది సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా గోవిందుడు కి ముందే ఇచ్చిన కమిట్మెంట్ ల కారణంగా థియేటర్ లు ఇచ్చేయాల్సి వచ్చింది.

లౌక్యం కి థియేటర్ లు లేవహో అని దాసరి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఊదరగోట్టేసారు. గోవిందుడు సరైన టాక్ లేకపోవడంతో లౌక్యం ని మళ్ళీ బరిలో దింపేశారు పంపిణీ దారులు.

ఇప్పుడు అదే కథ బ్రూస్ లీ కి కూడా నడుస్తుంది అని విశ్లేషకుల అంచనా. రుద్రమ దేవి మంచి టాక్ తో నడుస్తూ ఉండగా బ్రూస్ లీ వచ్చి ఆ సినిమా వసూళ్లు గండి కొట్టడమే కాకుండా సినిమా ని థియేటర్ లలో నుంచి బయటకి తన్నేసింది, ఇప్పుడు బ్రూస్ లీ సినిమా యావరేజ్ టాక్ రావడం తో రుద్రమ దేవి ని మళ్ళీ థియేటర్ లలోకి లాగే ఆలోచన చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్ లు ఇది బ్రూస్ లీ నిర్మాతలకి ఎంత మాత్రం ఇష్టం లేని వ్యవహహారం కావచ్చు కానీ పరిస్థితి మాత్రం చూస్తుంటే రుద్రమ దేవి కంటే బ్రూస్ లీ ఎక్కువ తమకి లాభాలు ఇవ్వలేదు అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -