అందాల భామ త్రిష.. అనుకున్నవి అన్ని సరిగ్గా జరిగి ఉంటే.. ఆమె పెళ్లి జరిగి సంతోషంగా ఉండేది. అయితే కోలీవుడ్ నిర్మాత.. ప్రముఖ పారిశ్రామికవేత్త.. అయిన వరుణ్ మణియన్తో ఆమె లవ్ వ్యవహారం ఎంగేజ్మెంట్ వరకు వెళ్లింది.. ఆ తర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో వారి పెళ్లి అక్కడితో అగిపోయింది.
అయితే వరుణ్ త్రిషతో బ్రేకప్ చేసుకున్నాక హాట్ హీరోయిన్ రాయ్లక్ష్మీతో చెట్టాపట్టాలేసుకుని జోరుగా తిరిగాడు. తర్వాత మళ్లీ వరుణ్ లైమ్ లైట్లో కనిపించకుండా పోయాడు. ఇప్పుడు వరుణ్ అనుకోకుండా మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. త్రిషతో బ్రేకప్ తర్వాత కొన్నాళ్లు సైలెంటుగా ఉన్న వరుణ్.. ఇప్పుడు మళ్లీ మరో అందమైన హీరోయిన్తో ఎఫైర్ స్టార్ట్ చేశాడన్న వార్తలు కోలీవుడ్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ కూడా మన తెలుగమ్మాయి అవ్వడం విశేషం.
ఆమే బిందు మాధవి. ప్రస్తుతం వీరిద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. బిందుమాధవికి హీరోయిన్ గా పెద్దగా చాన్స్లు రావడం లేదు. అందుకే ఇక లైఫ్ లో సెటిలైపోదామని ట్రై చేస్తోంది. ఇప్పుడు వీరిద్దరు చాలా హాట్ హాట్గా పక్క పక్కనే చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తున్నారు. వీరిద్దరూ డేటింగ్ లో కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వీరి బంధం ఎటు వైపు తెల్తుందో చూద్దాం.
Related