Sunday, May 19, 2024
- Advertisement -

ఆ సినిమాకు ఒక్క రూపాయి తీసుకున్న బాలీవుడ్ హీరో..?

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలు తెరకెక్కడం సర్వసాధారణమే. ఈ క్రమంలోనే ఎంతోమంది రచయితలు రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీల కథ ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ విధంగానే ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్‌ హాసన్‌ మాంటో జీవిత కథను కూడా “మాంటో” గా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించాగా నందితా దాస్ ఈ చిత్రానికి దర్శకురాలుగా వ్యవహరించారు.

మాంటో చిత్రంలో రిషి కపూర్‌, రన్‌వీర్ షోరే, జావేద్ అక్తర్‌, పరేష్‌ రావల్‌, దివ్యా దత్త కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో నటించిన ఈ సెలబ్రిటీలు అందరూ ఈ సినిమా కోసం ఎలాంటి పారితోషికం లేకుండా ఫ్రీ గానే నటించారని పలు సందర్భాలలో దర్శకురాలు నందితాదాస్ తెలియజేశారు.ఈ సినిమాలో వీరందరూ డబ్బుకు ఆశపడకుండా కేవలం స్క్రిప్ట్ కు ఎంతో విలువ నిచ్చే నటించారని ఈ సందర్భంగా నందితా దాస్ తెలిపారు.

Also read:నా భర్త మాటల వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న: ప్రియమణి

ఇంత మంది నటీనటులు ఉచితంగా “మాంటో” సినిమాకు పని చేయగా.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నవాజుద్దీన్‌ సిద్ధిఖీ మాత్రం ఈ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అయితే అతను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా? అక్షరాల ఒక్క రూపాయి మాత్రమే రెమ్యూనరేషన్ గా తీసుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ సందర్భంగా నవాజుద్దీన్ మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా నా ఆలోచనలను, నా ఆశయాలను వ్యక్తపరచాలి అనుకున్నప్పుడు నేను నందిత దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే అంతకన్నా మహాపాపం మరొకటి ఉండదని,అయితే ప్రొఫెషనల్ గా నటుడు కావడం వల్ల ఆమె దగ్గర నుంచి ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నట్లు తెలిపారు.

Also read:సుడిగాలి సుధీర్ పెళ్లిపై తండ్రి షాకింగ్ రియాక్షన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -