ఈ నెల 24,25 తేదీలలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఐఫా వేడుకలు జరగనున్నాయి. ఐతే గత డిసెంబర్లోనే ఈ వేడుకలు జరగాల్సింది కాని చెన్నై వరదల వల్ల ఈ వేడుకలను జనవరికి వాయిదా వేశారు. ఈ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లే. ఈ వేడుకలకు చాలా మంది సెలబ్రిటీలు రానున్నారు.
అలానే వారి డాన్స్లతో ప్రేక్షకులను ఆకట్టుకునబోతున్నారు. అందుకోసం రిహార్సల్స్ చేస్తున్నారు. అలానే వేడుకను గ్రాండ్గా చేయడానికి భారీ సెట్స్ కూడా వేశారు. సౌత్ ఇండస్ట్రీలో తొలిసారి ఈ ఐఫా వేడుకలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నుండి సినీ సెలబ్రిటీలు రాబోతున్నారు.
ఈ కార్యక్రమానికి అల్లు శిరీష్ హోస్ట్గా వ్యవహరించనున్నారని తెలుస్తుంది. రామ్ చరణ్, అఖిల్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఇంక హీరోయిన్స్ కూడా తమ పర్ఫార్మెన్స్తో అదరగోట్టబోతున్నారు.
{youtube}v=aKaFwfVpI1A{/youtube}