బాలీవుడ్లోని ప్రేమించుకోవడం.. విడిపోవడం చాలా మాములే. ఈ విషయంపైనే తాజాగా దీపికా పదుకొణె కూడా వార్తల్లోకెక్కింది. విషయంలోకి వెళ్తే.. రణ్బీర్ కపూర్, దీపికా పదుకొణె ప్రేమాయణం గురించి తెలిసిందే. వీరు రెండేళ్లు బాగా తిరిగారు. పెళ్లి వరకు వెళ్లారు. అయితే తనను మోసం చేశాడని అతని నుంచి విడిపోయింది దీపికా.
బ్రేకప్ గురించి దీపికా మాట్లాడుతూ.. శృంగారం అంటే కేవలం శరీరానికి సంబంధించినదే కాదు. అందులో చాలా ఎమోషన్స్ ఉంటాయి. తాను రిలేషన్ షిప్లో ఎన్నడూ మోసం చేయలేదని తెలిపింది. పదే పదే ఫూల్ను చేస్తూ ఉంటే అలాంటి రిలేషన్ షిప్ అవసరమా? అని చెప్పుకొచ్చింది. దానికి బదులు ఒంటరిగా ఉంటే బెటర్ అని అనిపించేదని అయితే అందరూ తనలా ఆలోచించకపోవచ్చని పేర్కొంది. తాను రెండో అవకాశం ఇవ్వడమే తన తప్పని, బతిమిలాడుకోవడం, అడుక్కోవడంతో ఇచ్చానని, అయితే అప్పటికే అందరూ చెబుతున్నారని అయినా తాను వినలేదని చెప్పింది. ఒకసారి తానే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని, అప్పటి నుంచి రిలేషన్ షిప్క్ స్వస్తి పలికానని పేర్కొంది.
తాను రిలేషన్ షిప్స్లో ఎంతో ఇచ్చాననని, ఏనాడు ఏది ఆశించలేదని తెలిపింది. ఒకసారి అనుమానాలు వస్తే.. మోసపోయానని తెలిస్తే.. గౌరవం చచ్చిపోతుంది. నమ్మకం ఉండదు. రిలేషన్ షిప్లో ఇవి లేకుండా సెక్స్ చేయలేమని చెప్పుకొచ్చింది. దీపికా రణ్బీర్ నుంచి 2009లో విడిపోయాక.. రణ్వీర్ సింగ్ను 2018 నవంబర్లో పెళ్లి చేసుకుంది. రణ్బీర్ మాత్రం కత్రినాతో ప్రేమ వ్యవహారం నడిపి ప్రస్తుతం అలియా భట్తో ఎంజాయ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.