Monday, April 29, 2024
- Advertisement -

శ్రీను వైట్లను బెదిరించి 85 లక్షలు తీసుకున్నారు..?

- Advertisement -

టాలీవుడ్ లో దర్శకుడు శ్రీను వైట్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. స్టార్ డైరెక్టర్ గా.. బడా హీరోలతో భారీ హిట్లు కొట్టాడు. ఆ తర్వాత వరస ప్లాప్ లతో కనిపించకుండా పోయాడు. ముఖ్యంగా మహేష్ బాబు ఆగడు, రామ్ చరణ్ బ్రూస్ లీ, వరుణ్ తేజ్ మిస్టర్ సినిమాల ప్రభావంతో శ్రీను వైట్ల పరిస్థితి ఘోరంగా తయారైయింది.

ఈ నెపథ్యంలో ఆర్థికంగా కూడా చాలానే నష్టపోయి పర్సనల్ గా కూడా శ్రీను వైట్ల కోలుకోలేని దెబ్బ తిన్నాడనే వార్తలు వినిపించాయి. వాటి సంగతెలా ఉన్నప్పటికి.. మిస్టర్ మూవీ విషయంలో నిర్మాతలు భారీ నష్టాలనే చూసారు. సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ నే నిర్మాతల చేత శ్రీను వైట్ల ఖర్చు పెట్టించాడని అప్పుడు చెప్పుకున్నారు. అంతేకాకుండా మినిమమ్ బడ్జెట్ లో తీయాల్సిన సినిమాను గొప్పలకుపోయి భారీ బడ్జెట్ తో తీసి.. భారీ నష్టాలనే మిగిల్చాడని అనుకున్నారు. అందుకే ఆ నష్టాల్లో శ్రీను వైట్ల కూడా వాటా తీసుకోవాల్సిందేనని అప్పుడు పట్టుబట్టినట్లు వార్తలు వచ్చాయి. దానికి సంబంధించే ఓ విషయం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజా మిస్టర్ సినిమా నిర్మాతలకు.. శ్రీను వైట్ల ఏకంగా 85 లక్షల రూపాయలు ముట్టజెప్పాడట.

అంటే, దగ్గరదగ్గరగా కోటి రూపాయలన్నమాట. అయితే సినిమా ప్లాప్ అయ్యి నిర్మాతలు నష్టపోతే.. కొద్ది మంది హీరోలు మాత్రమే వెనక్కి డబ్బు ఇచ్చేస్తారు. అంతే కానీ ఓ దర్శకుడు పరిహారం చెల్లించుకోవాల్సి రావడం అనేది జరగలేదు. మరి ఇది శ్రీను వైట్ల విషయంలోనే తొలిసారి జరిగిందేమో తెలియాలి. ఇది నిజమైతే.. ఇకపై బడ్జెట్ పెరిగిపోతుంటే, డైరెక్టర్స్ తో నిర్మాతలు ఇలాంటి ఒప్పందాలే చేసుకుంటారేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -