Monday, April 29, 2024
- Advertisement -

ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్న మూడు సినిమాలు.. ఏవంటే?

- Advertisement -

కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న నేపధ్యంలో థియేటర్లు మూత పడ్డాయి.ఒకవేళ థియేటర్లు తెచ్చుకున్న ప్రజలు అంత ధైర్యం చేసి థియేటర్లకు వచ్చి చూసే అవకాశాలు ఇప్పుడు లేనందున ఎన్నో సినిమాలు తమ దృష్టిని ఓటీటీ వైపు మళ్ళించాయి. అదేవిధంగా లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇంటికే పరిమితం కావడంతో ఇప్పటికే థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కావడానికి రంగం సిద్ధం చేశాయి. ఈ క్రమంలోనే ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మూడు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలు ఏమిటో ఓ లుక్కేద్దాం…

వెంకటేష్ ,మీనా జంటగా ఇదివరకే వచ్చిన త్రిల్లింగ్ సస్పెన్స్ మూవీ దృశ్యం ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన దృశ్యం 2 షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.నిజానికి ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలోనే తెలుగు వర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ కొన్నట్టు తెలుస్తుంది ఈక్రమంలోనే దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కరోనా కాలంలో నితిన్ హీరోగా నటించిన చెక్, రంగ్ దే థియేటర్లలో విడుదలయినప్పటికీ అనుకున్న స్థాయిని చేరుకోలేక పోయాయి.ఈ క్రమంలోనే నితిన్ హీరోగా తాజాగా మాస్ట్రో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నితిన్ సొంత బ్యానర్ లో నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.

Also read:లక్కీ ఛాన్స్ కొట్టేసిన..ఫరియా అబ్దుల్లా!

విశ్వక్సేన్ హీరో గా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన పాగల్ చిత్రాన్ని కూడా ఓటీటీ విడుదల చేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాగల్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ కైవసం చేసుకున్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Also read:10 మంది బాలీవుడ్ సెలబ్రెటీలతో ప్రభాస్ సినిమా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -