Friday, April 26, 2024
- Advertisement -

లక్కీ ఛాన్స్ కొట్టేసిన..ఫరియా అబ్దుల్లా!

- Advertisement -

ఇటీవలే అనుదీప్ దర్శకత్వంలో కామెడీ బ్యాక్ గ్రౌండ్ లో రూపొందించిన సినిమా “జాతిరత్నాలు” ఈ మూవీలో నవీన్ పోలిశెట్ట, ఫరియా అబ్దుల్లా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో హీరో స్నేహితులుగా ప్రధానపాత్రల్లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీ భారీ బడ్జెట్ సినిమాలకు దీటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాగే ఈ మూవీలో నటించిన నటీనటులకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించి వరుస అవకాశాలను చేజిక్కించుకున్నారు.

ముఖ్యంగా జాతి రత్నాలు మూవీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించి వారి మనస్సు దోచుకుంది. అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌లో కనిపించిన ఈ భామ.జాతిరత్నాలు సినిమా తర్వాత ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో ఆఫర్లు క్యూ కడుతున్నాయనే చెప్పాలి. మాస్ మహారాజ రవితేజ్ సినిమాలో కూడా ఈ అమ్మాయికి హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందనే వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి.

Also read:నటుడు సోనుసూద్ కి నోటీసులు జారీ చేసిన ముంబై హైకోర్టు?

తాజాగా ఈ బ్యూటీకి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. జాతి రత్నాలు మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో స్టార్ హీరో సరసన ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్ గా న‌టిస్తుంద‌నే సమాచారం గట్టిగా వినిపిస్తోంది.అలాగే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జాతి రత్నాలు సీక్వెల్‌ మూవీకి దర్శకత్వంలో చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.జాతి ర‌త్నాలు సీక్వెల్‌తో హీరోయిన్ గా ఫ‌రియా అబ్దుల్లా స్టార్ హోదాను సొంతం చేసుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

Also read:ఆది పురుష్ చిత్రంలోని కీలక పాత్ర పై స్పందించిన బిగ్ బాస్ విన్నర్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -