Thursday, April 25, 2024
- Advertisement -

షారుఖ్.. సారీ చెప్పేశాడు!

- Advertisement -

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్.. ఇన్నాళ్లకు తన నోటి దురుసును తానే అర్థం చేసుకున్నాడు. దేశంలో అసహనం ఉందంటూ.. ఆ విషయంపై మాట్లాడితే తమపై దాడి జరిగినా.. తమను జనాలు బూతులు తిట్టినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ ఈ మధ్య రీసెంట్ గా వివాదాస్పద కామెంట్లు చేసిన షారుఖ్.. ఇన్నాళ్లకు సారీ చెబుతున్నాడు.

దేశంలో పరిస్థితులు చూసి తన భార్య భయపడుతోందంటూ మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరున్న ఆమిర్ ఖాన్ వివాదాన్ని మొదలు పెట్టిన కొన్నాళ్లకే.. షారుఖ్ తన కామెంట్లతో రచ్చ రాజేశాడు. అంతగా భయపడాల్సిన అససరం లేకున్నా.. దేశంలో జనం ఆందోళన పడుతున్న సందర్భాలు లేకున్నా.. వివాదాస్పద కామెంట్లు చేసి ఏదో అసహనం రాజ్యమేలుతున్నట్టు మాట్లాడాడు.

ఇన్నాళ్లకు.. తన కొత్త సినిమా దిల్ వాలే విడుదలయ్యే సమయానికి కానీ.. షారుఖ్ కు గతం గుర్తుకు రాలేదు. తన కామెంట్లు.. తన సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తాయని అనుకున్నాడో లేక.. ఎందుకొచ్చిన వివాదం.. ఓ సారీ చెప్పేస్తే మంచిదని ఫిక్స్ అయ్యాడో. మొత్తానికి షారుఖ్ సారీ చెప్పాడు. తన కామెంట్లు ఎవరినైనా నొప్పించి ఉంటే మనసులో పెట్టుకోవద్దంటూ ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిక్వెస్ట్ చేశాడు.

గతంలో షారూఖ్ చేసిన కామెంట్లకు బాధపడిన వాళ్లంతా.. ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యారు. కానీ.. మరో వర్గం జనాలు మాత్రం బాలీవుడ్ స్టార్ తీరుపై మండి పడుతున్నారు. ఎప్పుడో కామెంట్ చేస్తే.. ఇన్నాళ్లకు షారుఖ్ సారీ ఎందుకు చెబుతున్నాడు?

ఇంతకుముందు అసహనంపై చెప్పిన మాటలకు ఆయన ఎందుకు కట్టుబడి ఉండడం లేదు? అంటే తన విషయంలో తనకే నిలకడ లేదా? ఓ హీరోగా యూత్ ను ఇన్ స్పైర్ చేసే స్థాయిలో ఉన్న హీరో.. ఇలా స్థిరత్వం లేకుండా మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న షారుఖ్.. ఎందుకొచ్చిన కష్టం అని అనుకుంటున్నాడట. బుద్ధొచ్చింది… ఇకపై వివాదానికి దారితీసే ఎలాంటి కామెంట్లు చేయొద్దని గట్టిగా ఫిక్స్ అయ్యాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -