Monday, May 6, 2024
- Advertisement -

బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. బాలయ్య నటవారసుడి వెండితెర ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో అదిగో అని ఉరించడం తప్ప అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది లేదు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి ఖచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉండనుందట.

ప్రస్తుతం వైజాగ్ సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు మోక్షజ్ఞ. బరువు తగ్గటం, ఫిజిక్ పై దృష్టి సారించడమే కాదు కొత్త లుక్ లో కనపడేందుకు చాలా కష్టపడుతున్నారట. సత్యానంద్ మాస్టర్ చాలా ఫేమస్. మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు ప్రభాస్, టాలీవుడ్ ఎందరో హీరోలకు నటనలో శిక్షణ ఇచ్చారు సత్యానంద్. అందుకే బాలయ్య..మోక్షజ్ఞను సత్యానంద్ దగ్గరికి పంపి నటనలో మెళకువలు నేర్పిస్తున్నారట.

వాస్తవానికి ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని భావించినా అది సాధ్య పడలేదు. అయితే ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్‌తో బాలయ్య అఖండ సీక్వెల్ అఖండ 2 కన్ఫామ్ కాగా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. ఈ సినిమా కథలో మోక్షజ్ఞ పాత్ర ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే అఖండ 2తో బాలయ్య నటవారసుడి ఎంట్రీ ఉండనుందని తెలుస్తోండగా దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -