Sunday, April 28, 2024
- Advertisement -

గుంటూరు కారం..ఓటీటీలో వెరీ స్పెషల్!

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్ల గ్రాస్, రూ.122 కోట్ల షేర్‌ని రాబట్టింది.

మిక్స్‌డ్ టాక్ వచ్చినా గుంటూరు కారం వసూళ్లు మాత్రం ఆగలేదు. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీకి సంబంధించి ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఇకప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది. సినిమా రన్ టైం ఎక్కువ కావడంతో థియేట‌ర్ల‌లో అమ్మ సాంగ్‌తో పాటు క‌బ‌డ్డీ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్‌ను తొలగించారు.

అయితే ఓటీటీలో మాత్రం రెండు సీన్లను యాడ్ చేసి రిలీజ్ చేయనున్నారట. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. త‌ల్లీకొడుకుల సెంటిమెంట్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు త్రివిక్రమ్. మహేష్ సరసన శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు. ర‌మ్య‌కృష్ణ‌, జ‌య‌రాం, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. హారిక హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రాధాకృష్ణ నిర్మించిన ఈ మూవీకి త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. వెండితెరపై భారీగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి సునామీ సృష్టిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -