హీరో నాగాశౌర్య వరుస పెట్టి హీరోయిన్లకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు.మొన్నటి కి మొన్న హీరోయిన్ సాయి పల్లవిని పొగరుబోతు పిల్లను ఎక్కడా చూడలేదన్నట్టు మాట్లాడాడు.ఆమెతో సినిమా తీయడం కష్టం అని ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.నాగశౌర్య,సాయిపల్లవి జంటగా ‘కణం’ సినిమా తీశారు.నాగశౌర్య కనీసం ఈ సినిమా ఆడియో ఫంక్షన్కు కాని ప్రమోషన్స్కు కాని రాకుండా దూరంగా ఉన్నాడు.దీనికి కారణం సాయిపల్లవినే తెలుస్తుంది.ఇప్పుడీ హీరో మరో హీరోయిన్ కు షాక్ ఇచ్చాడు. ఆమె మరెవరో కాదు, ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మెహ్రీన్.తన సొంత బ్యానర్ పై నర్తనశాల సినిమా స్టార్ట్ చేశాడు నాగశౌర్య.
ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.ఈ సినిమాలో ముందుగా మెహ్రీన్ ను అనుకున్నారు. ఆ విషయాన్ని చూచాయగా ఓపెనింగ్ రోజున స్వయంగా నాగశౌర్య వెల్లడించాడు.అంతలోనే ఊహించని మార్పు , చెప్పాపెట్టకుండా మెహ్రీన్ ను తన సినిమా నుంచి తొలిగించాడట నాగశౌర్య. రవితేజ లాంటి సీనియర్ సరసన చేసిన మెహ్రీన్ కంటే, తన సరసన కల్యాణి అయితే మరింత ఫ్రెష్ గా ఉంటుందని భావించాడో అర్థం కావడం లేదు. ఏదేమైనా ఛలో సక్సెస్ తర్వాత నాగశౌర్య వ్యవహార శైలిలో చాలా మార్పు వచ్చిందంటున్నారు సినీజనాలు.