క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్న అడవి శేష్కు క్షణం సినిమా హీరోగా మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత అడవి శేశ్కు మంచి అవకాశాలు వచ్చాయి. అమీతుమీ సినిమాలో కామెడీ పండించిన ఈ హీరో ఓ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఓ బాలీవుడ్ సినిమాను తెలుగులోకి తెచ్చే పనిలో పడ్డాడు.
హిందీలో సూపర్ హిట్టయిన టు స్టేట్స్ సినిమా తెలుగు రీమేక్లో అడవి శేష్ హీరోగా చేయబోతున్నాడని తెలుస్తోంది. చేతన్ భగత్ రాసిన టు స్టేట్స్ నవల ఆధారంగా హిందీలో అదే పేరుతో సినిమా తీశారు. అర్జున్ కపూర్ – ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా బాగా ఆడింది. తెలుగులో తీస్తున్నఈ సినిమాలో అడవిశేశ్ సరసన సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు నటిస్తోందంట. కొత్త దర్శకుడు వెంకట్రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందట. ఎం.ఎల్.వి. సత్యనారాయణ నిర్మాణంలో ఈ సినిమా రాబోతోందని టాక్ వినిపిస్తోంది.
టు స్టేట్స్ ఒరిజినల్ కథలో ఒక తెలుగు అబ్బాయిగా అడవి శేష్, ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా రాజశేఖర్ కూతురు శివాని రానుందంట. స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేసి తెలుగులో తీసుకువచ్చే అవకాశం ఉంది.