వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్నారు మాస్ మహారాజా రవితేజ. రీసెంట్గా ఈగల్ మూవీతో వచ్చినా అది బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అయితే దీనికి సీక్వెల్ ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. తొలివారంలో బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చినా తర్వాత ఢీలా పడిపోయింది. దీంతో ఈ సినిమా సేఫ్లోకి వెళ్లడం కష్టంగానే కనిపిస్తుంది.
ఎందుకంటే వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయినా సినిమాల నుండి ఈగల్కు గట్టి పోటీ నెలకొంది. దీంతో నిర్మాతలకు నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.
ఈగల్ మూవీకి రూ. 70కోట్ల వరకు బడ్జెట్ కాగా థియేట్రికల్ బిజినెస్ కేవలం రూ.22 కోట్లు మాత్రమే చేసింది. ఇంకా మిగితా రైట్స్ అన్ని కలుపుకున్నా రూ.30 కోట్లు దాటలేదు.
అయితే నిర్మాతలకు ఉన్న ఒకే ఒక్క ఆశ ఓటీటీ రైట్స్. కానీ ఈగల్ రైట్స్ని కొనడానికి ఏ ఓటీటీ సంస్థ ముందుకు రావడం లేదు. దీంతో నిర్మాతలు భారీ నష్టాన్ని చూడాల్సిందేనని టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీక్వెల్ అనౌన్స్ చేయగా అది పట్టాలెక్కుతుందా లేదా వేచిచూడాలి.