తెలుగులో స్ట్రాంగ్ గా ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో ఒకరు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు ఆ ఫ్యాన్స్ చాలా వర్రీ అవుతున్నారని సమాచారం. ఓ ప్రక్క పవన్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ .. మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకోగా…మరో ప్రక్క పవన్ …తనకు సినిమాలంటే ఆసక్తి లేనట్లుగా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే పవన్ ఈ నెల 29 నుంచి ఎస్ జె సూర్య దర్సకత్వంలో ఓ చిత్రం ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఓ ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీగా దాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం విన్న పవన్ ఫ్యాన్స్ మరింత కంగారు వచ్చిందని మీడియాలో చెప్పుకుంటున్నారు. ఎందుకంటే గతంలో పవన్ కి ఎస్ జె సూర్య..కొమరం పులి వంటి అతి పెద్ద డిజాస్టర్ చిత్రం ఇచ్చారు.
అంతేకాకుండా ఆయన తమిళంలో చేసిన సినిమాలు కూడా ఏమీ ఆడలేదు. దాంతో వారు కంగారు పడుతున్నారని, పవన్ కు ఈ విషయమై ఓ రిప్రజంటేషన్ ఇచ్చారని సమాచారం. ఎస్ జె సూర్యతో పనిచేయటం కన్నా త్రివిక్రమ్ చేస్తే మంచి క్వాలిటీ అవుట్ ఫుట్ వస్తుందని, డెషిషన్ మరోసారి ఆలోచించి తీసుకోమని ఆ రిప్రజెంటేషన్ లో ఉన్నట్లు వినపడుతోంది. మరి పవన్ ఏమంటారో చూడాలి. ఆయన సాధారణంగా తన అభిమానుల మాటకు విలువ ఇస్తూనే ఉంటారు.
ఐతే సర్దార్ గబ్బర్ సింగ్ బాహుబలి తర్వాత అమెరికాలో రెండో అతి పెద్ద ఓపెనర్ తెలుగు చిత్రంగా నమోదు అయ్యింది. ఇవన్నీ ఫ్యాన్స్ కు , సినీ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చే అంశాలే.అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఓవర్ సీస్ లో పూర్తి కలెక్షన్స్ పడిపోయినట్లు సమాచారం. పెట్టిన పెట్టుబడి వెనక్కి సగం కూడా తిరిగిరాదని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు.
