Friday, March 29, 2024
- Advertisement -

నటి వనితా మూడో పెళ్లి పెటాకులే.. భర్తను వెళ్ళగొట్టింది..!

- Advertisement -

వివాదాస్పద నటిగా వనితా విజయ్ కుమార్ పేరు తెచ్చుకుంది. ఈమె లాక్ డౌన్ లో మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2000లో టెలివిజన్ రంగానికి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న వనితా.. ఏడేళ్ల తరువాత అతడికి దూరమైంది. ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనికి కూడా విడాకులు ఇచ్చి.. రీసెంట్ గా ఇండస్ట్రీకి చెందిన పీటర్ పాల్ ని వనితా జూన్ లో వివాహం చేసుకుంది. ఈ వివాహం కోలీవుడ్ లో పెద్ద వివాదం అయింది.

పీటర్ పాల్ మొదటి భార్య తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడంటూ కేసు పెట్టింది. దాంతో వనితాపై అందరు విమర్శలు చేశారు. దీంతో వనితా.. ఈ విషయంను న్యాయపరంగా చూసుకుంటామని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉంటే.. రీసెంట్ గా వనితా తన భర్త పీటర్, పిల్లలతో కలిసి గోవా ట్రిప్ కి వెళ్లి వచ్చింది. అక్కడ వారిద్దరు తీసుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం మేరకు.. వనితా, పీటర్ ల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. గోవా ట్రిప్ లో పీటర్ ఎక్కువగా మద్యం సేవించి నానా గొడవ చేశాడట.

అంతేకాదు.. వనితాతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కొట్టిందట. అక్కడ నుండి చెన్నైకి వచ్చిన తరువాత కూడా పీటర్ మద్యం మత్తులో ఉండడంతో అతడిని ఇంటి నుండి తరిమేసిందట వనిత. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ విషయంపై వివరణ ఇస్తూ.. నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ తన సోషల్ మీడియాలో ”ఇల్లీగల్ మ్యారెక్ కి వ్యతిరేకంగా చాలా మంది కోరుకున్న కోరిక నెరవేరింది. పీపీ(పీటర్ పాల్)ని తరిమేశారు” అంటూ పోస్ట్ పెట్టాడు. మరి ఈ విషయంపై వనితా ఎలా స్పందిస్తుందో చూడాలి.

కాజల్ పెళ్లికి నాకు ఏం సంబంధం లేదు : నవదీప్

బుల్లితెరపై చేస్తున్న సంగీత ఎంత పారితోషికం తీసుకుంటుందంటే ?

రెండేసి పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు వీరే..!

అనసూయను పడేసేందుకు హైపర్ ఆది ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -