Sunday, April 28, 2024
- Advertisement -

శ్రీదేవి కూతురితో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..?

- Advertisement -

ధ‌డ‌క్‌తో సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చింది అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్.ఈ సినిమాతో బాలీవుడ్‌లో తొలి హిట్ అందుకుంది జాన్వీ.ఈ సినిమా త‌రువాత వ‌ర‌స‌గా బాలీవుడ్ సినిమాలు చేస్తు బిజీగా ఉంది.అయితే జాన్వీని తెలుగులో తీసుకురావ‌డానికి నిర్మాత‌లు రెడీగా ఉన్నప్ప‌టికి ప్ర‌స్తుతం ఆమె ఫోక‌స్ మొత్తం బాలీవుడ్ సినిమాలపైనే ఉంది.అయితే తాజాగా జాన్వీ తెలుగులో న‌టిచ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది.అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్ హీరోగా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండతో జాన్వీ ఓ సినిమా చేయ‌నుంద‌ని స‌మాచారం.

త‌న తల్లి శ్రీదేవికి లాగే తాను కూడా తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారాల‌ని భావిస్తుంద‌టా జాన్వీ,దీనిలో భాగంగానే ప్రస్తుతం తెలుగులో ఫుల్ ఫాంలో ఉన్నా విజ‌య్‌తో సినిమా చేస్తుందిని తెలుస్తుంది.ఈ విష‌యాన్ని స్వ‌యంగా సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా తెలిపాడు. పెళ్లి చూపులు,అర్జున్ రెడ్డి,గీతా గోవిందం సినిమా హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.ప్ర‌స్తుతం అత‌ను న‌టించిన నోటా సినిమా అక్టోబ‌ర్ 5న విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.మ‌రి ఈ సినిమా విజ‌య్‌కు మ‌రో హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -