జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీకి కమిటైన సంగతి తెలిసిందే. జనత గ్యారేజ్ తర్వర కొరటాల శివ దర్శకత్వంలో “ఎన్టీఆర్ 30” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ” జనతా గ్యారేజ్ ” బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాంతో వీరి కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈసారి ఈ క్రేజీ కాంబినేషన్ ఏలాంటి సంచలనలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఈ మూవీలో స్టోరీ పరంగా తండ్రి కొడుకుల పాత్రలలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట. దేశంలో వెనుకబడ్డ సముద్ర తీర ప్రాంత ప్రజల కష్టాల నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇటీవల హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తియ్యింది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ కి జోడీగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటింస్తుంది. అలాగే విలన్ గా సైఫ్ అలీఖాన్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది.
పాన్ ఇండియా మూవీగా NTR30 సినిమాన్ని తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్పై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్స్గా పేరున్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర ప్రసాద్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.