టాలీవుడ్లో మరో క్రేజీ ఫైట్కు రంగం సిద్ధమైంది. సాధారణంగా దసరా లేదా పెద్ద హీరోలు బాక్సాఫీస్ ముందు తలపడుతున్నారంటే అదో పెద్ద వార్త. ఎందుకంటే ఎవరి సినిమా సక్సెస్ అవుతుంది, ఎవరి సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న టెన్షన్ అందరిలో నెలకొంటుంది.
తాజాగా 2024 అలాంటి సందర్భానికే వేదిక కానుంది. అయితే ఈ సారి నందమూరి కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ ముందు తలపడనున్నారు. ఒకరు నందమూరి బాలకృష్ణ అయితే మరొకరు జూనియ్ ఎన్టీఆర్. ఇక ఇప్పటికే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత వీరిద్దరి మధ్య గ్యాప్ చాలా పెరిగిపోగా ఒకానొక దశలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఏంటీ ఐ డోంట్ కేర్ అని బాలయ్య బహిరంగంగానే మాట్లాడిన సందర్భాలున్నాయి.
ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన హీరోలు తలపడుతుండటం తొలిసారి కాగా ఈ ఫైట్ ఎలా ఉండనుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. భగవంత్ కేసరి హిట్ తర్వాత బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సైతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా దేవర చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు సరిగ్గా వారం రోజుల గ్యాప్లో రిలీజ్ కానున్నాయి. తొలుత ఎన్టీఆర్ దేవర ఫస్ట్ పార్ట్ ను 2024 ఏప్రిల్ 5న రిలీజ్ డేట్ లాక్ కాగా తాజాగా బాలయ్య 109 సైతం వారం రోజుల ముందుగా 2024 మార్చి 29న రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడి వార్త టీ టౌన్ని షేక్ చేస్తుండగా నందమూరి ఫ్యాన్స్ మాత్రం టెన్షన్లో ఉన్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎవరి సినిమా బాక్సఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంటుందో ఎవరి సినిమా ఫ్లాప్ అవుతందోనని ఆందోళనలో ఉన్నాయి. మొత్తంగా ఈ రెండు సినిమాలతో బాబాయ్ బాలయ్య – అబ్బాయి ఎన్టీఆర్ మధ్య గ్యాప్ మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.