కింగ్ నాగార్జున అభిమానుల్లో యువ దర్శకుడు చందూ మొండేటి ఒకరు. అక్కినేని హీరోలపై తనకున్న అభిమానాన్ని పలు సందర్భాల్లో చాటుకున్న ఆయన ఇప్పటికే నాగచైతన్యతో రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో నాగ చైతన్య సరసన కథానాయిక పాత్ర కోసం కీర్తి సురేష్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం నటి కీర్తి సురేష్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. నాగ చైతన్య, చందూ సినిమాని జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య మత్స్యకారుని పాత్రలో నటిస్తారని, ఇది గ్రామీణ నేపథ్యంలో రూపొందుతుందని నిర్మాత బన్నీ వాస్ ఇప్పటికే చెప్పారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉన్నట్టు చెబుతున్నారు, అందులో నటి కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ మరో కథానాయికగా కనిపించనుంది.
ఇప్పటివరకు నాగ చైతన్య, కీర్తి సురేష్లు కలిసి నటించలేదు. అయితే కీర్తి సురేష్ నటించిన మహానటిలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో చైతన్య కనిపించాడు. సో, ఈ కొత్త సినిమా వీరిద్దరి కాంబినేషన్లో మొదటి సినిమా అవుతుంది. అనుపమ ఇప్పటికే నాగ చైతన్య, చందూ మొండేటితో ‘ప్రేమమ్’ చేసింది.
గతంలో నాగ చైతన్య 100% లవ్ సినిమా గీతా ఆర్ట్స్ నిర్మించింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ టాప్ ప్రొడక్షన్ హౌస్ మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చందూ మొండేటి నాగ చైతన్యతో మలయాళ రీమేక్ ప్రేమమ్ మరియు సవ్యసాచి అనే రెండు సినిమాలు చేసాడు. మొదటిది విజయవంతమైన చిత్రం కాగా, రెండోది బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.
Also Read: ప్రభాస్ సాలార్ సినిమా స్టోరీ లైన్ ఇదేనా..?