Tuesday, April 30, 2024
- Advertisement -

పవన్ తో ఐదు నిముషాలు బెస్ట్ ఎక్స్ పీరియన్స్.. కెతిక అలా ఓపెన్ గా చెప్పేసిందే..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఏ హీరోయిన్ కి అయినా సరే ఒక క్రేజ్ ఉంటుంది. పవన్ సినిమాలో ఒకసారి కనిపించినా చాలు అనుకునే వారు చాలామంది ఉన్నారు. అలాంటి భామల్లోనే ఒకరు యువ హీరో కెతిక శర్మ. పూరీ నిర్మాణంలో తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది కెతిక శర్మ. రొమాంటిక్ లో తన హాట్ లుక్స్ తో ఆడియన్స్ ని అలరించిన అమ్మడు హిట్ మాత్రం అందుకోలేదు.

ఆ తర్వాత నాగ శౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమా ఛాన్స్ అందుకుంది. ఆ రెండు సినిమాలు కూడా నిరాశ పరచాయి. ఇప్పుడు చివరి అవకాశంగా పవన్ బ్రో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. బ్రో సినిమాలో సాయి తేజ్ కూడా నటిస్తున్నాడు. సినిమాలో సాయి తేజ్ కి జతగా కెతిక శర్మ నటిస్తుంది. ఈ సినిమాతో అమ్మడు ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది.

అయితే కెతిక శర్మ ఈ సినిమా ఓకే చేయడానికి కారణం పవన్ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక అదృష్టమని.. ఆయన ఉన్నారనే ఈ సినిమా చేశానని అంటుంది. ఆయనతో కలిసి నటించే ఐదు నిమిషాల సీన్ అయినా సరే తనకు ఎంతో ఇష్టమని అంటుంది కెతిక శర్మ. సో పవన్ మీద తన అభిమానంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది అమ్మడు. మరి బ్రోతో అమ్మడి హిట్ కల నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -