Sunday, May 19, 2024
- Advertisement -

అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు

- Advertisement -

టాలీవుడ్ లో టాప్ చైర్ కోసం చాలా కాలంగా పోటీ నడుస్తూనే ఉంది. భారీ సినిమాలు.. కలెక్షన్లు.. ఇండస్ట్రీ హిట్లు.. ఫ్యాన్ ఫాలోయింగ్.. ఇలా.. చాలా లెక్కలు ఎక్కాలు బడా హీరోల రేంజ్ ను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నాయి. ఇండస్ట్రీలో మూడు దశాబ్దాలు మెగాస్టార్ గా.. చిరంజీవి వన్ మ్యాన్ షో తర్వాత… ఆ స్థానాన్ని ఎవరు సొంతం చేసుకుంటారన్న చర్చ చాలా కాలమే నడిచింది.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఈ కాంపిటీషన్ కొన్నాళ్లు నడిచినా.. స్థాయికి తగ్గ హిట్లు పడకపోవడంతో.. రేస్ నుంచి జూనియర్ సైడయ్యాడు. కొన్నాళ్లుగా పవన్ మహేష్ మధ్యే టఫ్ ఫైట్ నడుస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. కానీ.. సినిమాలనే నమ్ముకుంటూ.. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఇండస్ట్రీ స్టార్ గా ఎదుగుతున్న మహేష్… ఓ అడుగు ముందున్నాడని కొందరు అంటున్నారు.

ఇటు పవన్ కళ్యాణ్ సంగతి చూస్తే.. ఒకే సారి రెండు పడవలపై కాళ్లు పెడుతున్నాడు. ఇటు సినిమాలు.. అటు రాజకీయాలు. దేనికీ సరిగా టైమ్ కేటాయించలేక అందరితో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సినిమా సినిమాకూ గ్యాప్ కూడా పెంచుకుంటూ పోతున్నాడు. ఈ సిచువేషన్ ను అడ్వాంటేజ్ గా తీసుకుంటున్న మహేష్.. జాగ్రత్తగా, పక్కా ప్లాన్ తో ముందుకు పోతున్నట్టే కనిపిస్తోంది. 

శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత.. మహేష్ రేంజ్ ఇంకా పెరిగిపోయింది. ఈ టెంపో ఇలాగే కంటిన్యూ చేసి.. టాప్ హీరో చైర్ సొంతం చేసుకోవాలని మహేష్ ట్రై చేస్తున్నాడట. భార్య నమ్రతా ప్లానింగ్ కు తోడు.. తండ్రి కృష్ణ గైడెన్స్ కూడా తోడవడం.. ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు ఇప్పుడు మహేష్ వైపు చూస్తుండడం..

ఇదే టైమ్ లో అడ్వర్ టైజ్ మెంట్లతో ప్రిన్స్ కు నేషనల్ బ్రాండ్ ఇమేజ్ రావడం. ఇలా ఒకదాని వెంట ఒకటి కలిసి వస్తుండడంతో.. ఇదే మంచి టైమ్ అని నంబర్ వన్ రేస్ పై మహేష్ అండ్ కో కాన్సన్ ట్రేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

మిగతా సంగతులు ఎలా ఉన్నా.. సినిమాల విషయంలో పవన్ తన రూట్ మార్చకపోతే.. జూనియర్ ఎన్టీఆర్ రూట్ లో సైడ్ కావాల్సి వస్తుందే అని టాలీవుడ్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -