Sunday, April 28, 2024
- Advertisement -

ప‌వ‌న్ లాగే చేస్తున్న మ‌హేష్‌

- Advertisement -

మ‌హేష్ బాబుకి టాలీవుడ్‌లోనే కాదు ఇండియా మొత్తం క్రేజ్ ఉన్న సూప‌ర్ స్టార్‌.కాని ప్ర‌స్తుతం మ‌హేష్‌కి టైమ్ అస‌లు బాలేద‌నే చేప్పాలి. గత నాలుగేళ్లలో ఒక్క ‘శ్రీమంతుడు’ మినహాయిస్తే మహేష్ చేసిన సినిమాలు బాక్స్‌ఫిస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు.ఎంతో ఆశ పెట్టుకున్న స్పైడ‌ర్ నిరాశ ప‌రిచింది.ప్ర‌స్తుతం మ‌హేష్ కొర‌ట‌ల శివతో భ‌ర‌త్ అను నేను సినిమా చేస్తున్నాడు.వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ‘శ్రీమంతుడు’ లాంటి ఇండ‌స్ట్రీ హిట్ రావ‌డంతో ఈ సినిమా పై అంచ‌నాలు ఉన్నాయి.

కాని ఈ సినిమా పై ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.ఈ సినిమా షూటింగ్ మొదలై ఐదారు నెలలైంది.నిజానికి సంక్రాంతికే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుని వేసవికి వాయిదా వేశారు.ఐతే ఇప్పటిదాకా ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేయలేదు. ఇంకే విశేషాన్నీ పంచుకోలేదు. ఈ చిత్రానికి ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ అదేమీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ కూడా రావట్లేదు.

మరోవైపు వేసవి బరిలోనే ఉన్న ‘నా పేరు సూర్య’ ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. మొన్న జనవరి 1కి రిలీజ్ చేసిన ఫస్ట్ ఇంపాక్ట్ అదిరిపోయిందన్న టాక్ వచ్చింది. కానీ మహేష్ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా ఏ ముచ్చటా లేదు. చూస్తుంటే.. ‘అజ్ఞాతవాసి’కి పవన్ కళ్యాణ్ ఫాలో అయిన రూటునే మహేష్ కూడా అనుసరిస్తాడేమో అనిపిస్తోంది. రిలీజ్ ముంగిట ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ లాంటివి లాంచ్ చేస్తారేమో.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -