Sunday, April 28, 2024
- Advertisement -

క్రేజీ కాంబో..మహేష్‌తో నాగ్ మల్టీస్టారర్‌!

- Advertisement -

గతేడాది సంక్రాంతికి సొగ్గాడే చిన్ని నాయనతో హిట్ కొట్టిన కింగ్ నాగార్జున ఈ ఏడాది కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో నా సామిరంగ అంటూ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నాగ్. కీరవాణి సంగీతం అందించగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు నాగ్. తన సినిమాలు అన్నింటిలో నా సామిరంగ చాలా మాస్సీ అని తెలిపారు. అలాగే మహేష్‌ బాబుతో మల్టీ స్టారర్ గురించి ప్రశ్నించగా ప్రస్తుతం రాజమౌళి సినిమాలో మహేశ్ బిజీగా ఉన్నారని, అది పూర్తయిన తర్వాత మల్టీ స్టారర్ గురించి ఆలోచిస్తానని తెలిపారు. ఇక తన తర్వాతి చిత్రం శేఖర్ కమ్ములతో ఉండనుందన్నారు.

నా సామిరంగలో అన్ని ఎమోషన్స్ ఉంటాయని.. మలయాళ మూవీ రీమేక్ అయినా తెలుగు నేటివిటికి తగ్గట్టుగా విజయ్ తెరకెక్కించారన్నారు. విజయ్ బిన్నీని దర్శకుడిగా అనుకోకముందే అల్లరి నరేష్ పాత్రని ఫిక్స్ అయ్యామని చెప్పారు నాగ్. తనతో పాటు రాజ్ తరుణ్‌ది కీలకమైన పాత్ర పోషించారని చెప్పారు. మొత్తంగా నా సామిరంగ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు నాగ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -