Friday, May 3, 2024
- Advertisement -

రాజమౌళికి షాక్‌..అనిల్‌తోనే మహేష్‌!

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్‌ బాబు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నారు మహేష్.

ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక రాజమౌళితో సినిమా అంటే మరే సినిమాకు కమిట్ అవడం కష్టం. ఎందుకంటే తన ప్రాజెక్టు పూర్తయ్యే వరకు హీరోకు వేరే సినిమా చేయడానికి ఛాన్స్ ఇవ్వరు. అలా అనీ రాజమౌళి త్వరగా సినిమా కంప్లీట్ చేస్తారా అంటే సమాధానం లేని ప్రశ్నే. ఎందుకంటే కనీసంలో కనీసం ఏడాదైనా పడుతుంది సినిమా కంప్లీట్ కావడానికి.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఈ గ్యాప్‌లో అనిల్ రావిపూడి సినిమా చేయడానికి సిద్ధం అయ్యారట మహేష్‌. వీరిద్దరి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం అనిల్ …బాలయ్యతో భగవంత్ కేసరి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా నెక్ట్స్ మహేష్ సినిమాను పట్టాలెక్కించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -