అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2,ఎఫ్ 3 ప్రేక్షకులను ఆకట్టుకోగా తాజాగా వెంకీతో మరో ఎంటర్టైనర్ని తెరకెక్కిస్తున్నారు అనిల్. శ్రీవెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తుండగా 2025 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఎక్స్ ట్రార్డినరీ ట్రై యాంగిలర్ క్రైమ్ ఎంటర్టైన గా వస్తుండగా కథ మొత్తం మూడు పాత్రల చట్టూ తిరుగుతుంది. హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్స్ లెంట్ వైఫ్..ఈ ముగ్గురు పాత్రల మధ్య జరిగే చిత్రవిచిత్ర సన్నివేశాలతో ఈ మూవీ ఉండనుంది. భారీ బడ్జెట్తో వస్తున్న ఈ చిత్రానికి సిసిరోలియో సంగీతం అందిస్తుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది.
వెంకీ సరసన గుంటూరు కారం ఫేం మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త ఫ్యాన్స్లో జోష్ నింపగా దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.