Tuesday, April 30, 2024
- Advertisement -

రష్మీని బూతులు తిట్టిన మెగా ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

- Advertisement -
Mega Fans Hurts Rashmi Gautam

జబర్ధస్త్ హాట్ యాంకర్ రష్మీ ఓ వివాదంలో చిక్కుకుని తెగ బాధపడుతోంది. ఆమెపై ఫ్యాన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇటివలే రామ్ చరణ్ సినిమా ‘ధృవ’ రిలీజైన విషయం తెలిసిందే. ఎవరో ఈ సినిమాను.. ‘గుంటూరు టాకీస్’ను పోలుస్తూ ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టారు.

అందులో ‘గుంటూరు టాకీస్ ఫస్ట్ డే విజయవాడ కలెక్షన్లు రూ.17 లక్షలని.. ‘ధృవ’ ఇక్కడ రూ.14 లక్షలే కలెక్ట్ చేసిందని పేర్కొన్నారు. ఇది యాంటీ ఫ్యాన్స్ పనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే దీన్ని లైట్ తీసుకోకుండా ఎవరో చేసిందానికి రష్మీ మీద పడ్డారు మెగా ఫ్యాన్స్. కొందరు మెగా ఫ్యాన్స్ రష్మీ ని బూతులు తిట్టేస్తూ.. ఆమెను ట్యాగ్ చేస్తూ దారుణమైన కామెంట్లు చేశారు. ఆమె క్యాస్ట్ గురించి కూడా మాట్లాడారు. దీంతో రష్మీ హర్టయింది. జోకుల్ని జోకుల్లా తీసుకోకుండా ఇలా హేట్ కామెంట్స్ పెట్టడం ఏంటని వాపోయింది.

తన కులం గురించి కామెంట్లు చేసిన వాళ్లను ఉద్దేశించి.. మనం ఏ కాలంలో ఉన్నాం అని ప్రశ్నించింది. తనను తిట్టి పోసిన కొందరితో వన్ టు వన్ ఫైట్ కు దిగింది రష్మీ. ఐతే ఓ మెగా అభిమాని.. ఈ వివాదానికి తెర దించాడు. మెగా అభిమానుల తరఫున సారీ చెప్పి.. ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకోమన్నాడు. ఇంతకుముందు అనసూయ సైతం అల్లు అర్జున్ మీద కామెంట్లు చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

Related

  1. యాంకర్ రష్మీ వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
  2. యాంకర్ రష్మీ అరెస్ట్…కారణం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
  3. వ్యభిచారం గురించి రష్మీ ఏం చెప్పిందంటే?
  4. రష్మీ-సుధీర్ ల ఎఫైర్ గురించి షాకింగ్ నిజాలు చిప్పిన గెటప్ శ్రీను!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -