గురు శుక్రవారాల్లో ఈ టీవీలో వచ్చే జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎంతో ఫాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ ప్రోగ్రామ్ లో యాంకర్ గా రష్మీ చేస్తోంది. తన అందాలతో కుర్రకారుకు పిచ్చేక్కిస్తోంది. ఈ షో ద్వారా బాగా క్రేజ్ సంపాధించుకున్న రష్మీ.. కేవలం ఈ ప్రోగ్రామే కాకుండా ఇతర ప్రోగ్రాంలు కూడా చేస్తోంది.
బుల్లితెర మీదనే కాకుండా వెండితెర మీద కూడా తన సత్తా చాటుతోంది ఈ అందాల భామ. గుంటూర్ టాకీస్ చిత్రంతో హీరోయిన్ గా చేసి.. పలు సినిమాలతో దూసుకెళ్తోంది. సినిమాల్లో హాట్ గా నటిస్తూ కుర్రకారు మతి పోగొడుతుంటుంది. అయితే ఈ హాట్ యాంకర్ గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. అయితే సినీ తారాలు పబ్ లకు వెళ్లడం మాములే. అయితే ఆ పబ్ లకు వెళ్లి హాడావుడి చేసి.. తప్పతాగి గొడవలు కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఈ అమ్మడు కూడా ఓ పబ్ కు వెళ్లి పుల్ గా తాగి హాడావుడి చేసినట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా తాగిన మత్తులో రోడ్డుపైకి వచ్చి అక్కడ వచ్చేపోయేవారిని ఇబ్బంది కూడా పెట్టిందట. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్ట్ చేసారట. ఈ వార్త విని ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారని తెలుస్తోంది.
Related