Friday, May 3, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ లు ఖంగు తిన్నారు !

- Advertisement -

మలయాళ సినిమాల గురించి మినిమం తెలిసిన ఎవ్వరికైనా సరే మోహన్ లాల్ గురించి తెలిసే ఉంటుంది. అక్కడ మంచి స్టార్ గా పేరున్న మోహన్ లాల్ ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు. తెలుగులో అప్పుడెప్పుడో గాండీవం సినిమా లో చేసిన ఆయన మణిరత్నం సినిమా ఇద్దరు దయవలన తెలుగు సినిమా ప్రేక్షకులు అందరికీ సుపరిచితం.

మొన్న తమిళం లో జిల్లా సినిమా డబ్బింగ్ మొదలు పెట్టిన మోహన్ లాల్ ఇప్పుడు బిజీ గా ఉన్నారు. ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ కి సంతకం పెట్టి ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ లో బిజీ అయిన ఈయన చంద్ర శేఖర్ ఏలేటి డైరెక్షన్ లో తెరకి ఎక్కుతున్న ‘ మనమంతా ‘ అనే సినిమాలో నటిస్తున్నారు. జనతా గ్యారేజ్ విషయం లో మోహన్ లాల్ పారితోషికం  గురించి ఒక ఆసక్తికర విషయం బయటకి ఒచ్చింది.

మాకు అందిన సమాచారం మేరకు తమ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించేందుకు ‘జనతా గ్యారెజ్’ నిర్మాతలు మోహన్ లాల్కు 1.5కోట్ల రూపాయలతో పాటు మళయాల హక్కులను ఆఫర్ చేశారట. మళయాల హక్కులు కోటి రూపాయలు పలుకుతాయని నిర్మాతలు భావించగా, ఏకంగా 4 కోట్ల రూపాయలు పలికి మోహన్ లాల్కు జాక్పాట్ తెచ్చాయట. దీంతో మోహన్ లాల్, ‘జనతా గ్యారెజ్’తో ఈ స్థాయి జాక్పాట్ కొట్టడం ఆసక్తికరంగా మారిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర సినిమాకు ఓ హైలైట్గా నిలుస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -