చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం తం డేల్. మూడోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుండగా సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ ని అందించారు. సముద్రం మధ్యలో ఓ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సీన్స్ సినిమాకే హైలైట్గా నిలవనున్నాయట. ఇక రానున్న రోజుల్లో సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ ఇస్తామని తెలిపారు.
ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండగా గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో చైతూ లుక్ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. మత్స్యకారునిగా నటించడానికి బీస్ట్ మోడ్కి మారారు చైతన్య. కండలు తిరిగి దేహం కోసం గత కొన్ని నెలలుగా చాలా హార్ట్ వర్క్ చేశారు.
యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఒరిజినల్ లొకేషన్లలోనే జరగనుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్ గా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.