Sunday, May 19, 2024
- Advertisement -

రోజా ఏడుపుకు.. నాగబాబు సీరియస్ కు కారణం ఏంటి..?

- Advertisement -

జబర్ధస్త్ టీం ప్రతి ఏటా దసరాకు తమ ప్రొగ్రాంస్ తో జనాలను అలరిస్తుంటారు. సరదా సరదాగా సందడిగా దసరా మహోత్సవం జరుగుతోంది. అయితే ఈ ఏడాది చాలా ఎమోషనల్, కాంట్రవర్సీ కాన్సెప్టులతో ప్రోగ్రాం డిజైన్ చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రముఖ ఈటీవి ఛానెల్లో ‘దసరా మహోత్సవం’ పేరుతో ఓ స్పేషల్ ప్రోగ్రాంను రూపొందించారు. గత ఏడాది కామెడీ, డాన్సులు, స్కిట్స్‌తో చాలా సందడిగా ప్రోగ్రాం జరిగింది.

కానీ ఈ సంవత్సరం ‘దసరా మహోత్సవం’ కార్యక్రమం ప్రోమో చూస్తుంటే.. చాలా ఎమోషనల్ గా.. కాంట్రవర్సీ గా జరిగినట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ దసరా సంబంధించి.. ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో నాగబాబు.. రోజాను.. ‘కోహినూర్ డైమాండ్’ అంటూ పొగడడం.. అందుకు రోజా సిగ్గుపడటం… ఆ తర్వాత కాస్త సరదా సరదాగా ప్రోమో సాగాడం.. కానీ చివర్లో నాగబాబు ఈ షో నుంచి కోపంతో వెళ్లిపోవడం.. సుధీర్‌కు వార్నింగ్ ఇవ్వడం.. అలాగే రోజా ఏడవటం వంటివి కనిపిస్తున్నాయి. ఇవి సరిపోవన్నట్లు.. చివరల్లో యాంకర్ అనసూయ కళ్లు తిరిగి పడిపోతున్నట్లుగా చూపించారు.

మొత్తానికి ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులకు ఏం జరిగిందోనన్న ఆసక్తి రేకెత్తించే విధంగా వున్నప్పటికీ… సినీజనాలకు మాత్రం ఇదంతా కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసమే ఇలా ప్రోమోని కట్ చేసి వదిలారని అంటున్నారు. మొత్తానికి నాగబాబు ఎందుకు షో నుంచి సీరియస్‌గా వెళ్లిపోయాడో… రోజా ఎందుకు ఏడ్చిందో తెలియాలంటే దసరా వరకు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -