Sunday, April 28, 2024
- Advertisement -

చంచల్‌గూడ జైలులో నాగ్!

- Advertisement -

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కింగ్ నాగార్జున – ధనుష్ కాంబోలో మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌ గూడ జైలులో జరుగుతోంది. జైలు వద్ద రెండురోజులుగా షూటింగ్‌ కొనసాగుతోండగా మరో రెండురోజులు షూటింగ్‌ జరగనుంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా శేఖర్ కమ్ములతో దేవిశ్రీ ప్రసాద్ కి ఇది మొదటి సినిమా.

రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గతంలో అమలతో లైఫ్‌ ఈజ్‌ బ్యూటీపుల్‌ సినిమా తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. అప్పట్లోనే తనతో సినిమా చేయాలని శేఖర్‌ని కోరారు నాగార్జున. అది ఇప్పుడు కార్యరూపం దాల్చగా ఈ క్రేజీ మల్టీస్టారర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -