Friday, May 3, 2024
- Advertisement -

యాంకర్ శ్యామలకు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

- Advertisement -

సినీ పరిశ్రమలో కొందరు హీరోలు.. అభిమానులు చేసే ఒత్తిడి వల్ల సహనం కోల్పోయి మాట్లాడుతుంటారు. ఇక కొందరు అయితే అభిమానులు చేసే రచ్చ తట్టుకోలేక వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే టాలీవుడ్ లో అక్కినేని నాగర్జున చాలా పద్దతిగా.. కూల్ గా ఉంటారనే టాక్ ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లారు. అందుకే అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో మంచి గౌరవం ఉంది.

అలాంటి నాగార్జున ఇప్పుడూ ఓ యాంకర్ పై సీరియస్ అయ్యారు. అసలు విషయంకు వెళ్తే.. రాజు గారి గది 2 రిలీజ్ అవుతున్న సందర్భంగా నిన్నటివరకు కొన్ని చానల్స్ కి అక్కినేని నాగార్జున, సమంత ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా.. ఓ ఛానల్ లో యాంకర్ అడిగిన ప్రశ్నలకు కూల్ గా సమాధానం ఇస్తూనే.. ఓ ప్రశ్నకు మాత్రం నవ్వుతూనే సీరియస్ అయ్యారు. యాంకర్ శ్యామల.. నాగార్జునను ‘మీసం ఎందుకు తీసేశారని ప్రశ్నించింది? దానికి నాగ్ రిప్లై ఇస్తూ ఇలాగే బాగుందని చాలామంది అంటున్నారు.. ఏం బాగాలేదా? అని ప్రశ్నించాడు.

అవును బాగుంది.. కానీ మీసాలు అంటే ఇంకా రొమాంటిక్ గా ఉంటుంది అంటున్నారు. అయితే మన్మధుడు అని పేరు తెచ్చుకున్న మీరు మీసం తీసి వయసు తగ్గిద్దామని ప్రయత్నిస్తున్నారా ? అని ప్రశ్నించింది. దీంతో నాగర్జున చిర్రెత్తుకొచ్చింది. నవ్వుకుంటూ..పక్కనే కోడలుంది బిహేవ్ యువర్ సెల్ఫ్ అని నవ్వుతూ వార్నింగ్ ఇచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -