Saturday, May 4, 2024
- Advertisement -

నవదీప్ ట్వీట్.. డ్రగ్స్ కేసులో రానాని ఇరికించేలా..?

- Advertisement -

డ్రగ్స్ కేసు విషయంలో.. సిట్ అధికారుల నుండి నవదీప్ సుమారు 11 గంటల పాటు విచారణను ఎదురుకున్నాడు. ఇంతకు ముందు వచ్చిన సెలబ్రిటిల మాదిరి కాకుండా నవదీప్ చాలా ఉల్లాసంగా కనిపించారు. తనకు తెలిసిన విషయాలను చెప్పానని.. మళ్లీ రమ్మని అడగలేదు కానీ.. అవసరం ఉంటే ఫోన్ చేస్తామన్నారని మీడియాకు తెలిపి వెళ్లిపోయారు.

అయితే విచరణ ఎదురుకున్నావారు మీడియా ముందు రెండు విషయాలను చెప్పడం.. ఆ తర్వాత తమ ఆవేదనను సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేయడం ఈ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ తర్వాత సెలబ్రిటీలు రెగ్యులర్ గా చేస్తోన్న విషయాలు. అయితే నవదీప్ కూడా ఎలాఅంటి వీడియోతో ప్రేక్షకుల ముందు వస్తారో అని అందరూ అనుకున్నారు. అయితే తనపై నమ్మకం పెట్టుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ నుండి ముందుకెళ్ళాల్సిన ఆవశ్యకత ఉందంటూ ట్విట్టర్ వేదికగా సిట్ విచారణ తర్వాత తన భావాలను వ్యక్తపరిచారు.

ఇక ఆ తర్వాత ఎప్పటిలాఅనే ఉదయాన్నే దగ్గుపాటి రానా నేనే రాజు నేనే మంత్రి సినిమాకు సంబంధించిన పోస్టర్ ను పోస్ట్ చేసి రెడీ టు ఫైర్ అని మరో ట్వీట్ చేశారు. అయితే అయితే విచారణ తర్వాత రెడీ టు ఫైర్ అని చెప్పడం వెనక డబుల్ మీనింగ్ ఏమైనా ఉందా.. లేక సింగిల్ మీనింగేనా.. అనేది చాలా ఆసక్తిగా మారింది. అయితే ఈ మూవీకు సంబంధించిన ప్రతి విషయంను నవదీప్ ఫోస్ట్ చేస్తుడటంతో.. ఇది పెద్ద విషయంగా మారాలేదు. లేకుంటే నవదీప్ ట్వీట్ పెద్ద సంచలనం సోష‌ల్ మీడియాలో కలకలమే సృష్టించేది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -