నికిషా పటేల్… ఈ హీరోయిన్ కి తెలుగులో పెద్దగా చాన్స్ లు రాలేదు. పవర్స్టార్ పవన్కళ్యాణ్ కొమరం పులి లో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ భామ అడ్రస్ లేదు. తర్వాత ఇక్కడ చాన్స్ ల కోసం చూసిన రాకపోవడంతో తమిళ్, కన్నడ లోకి వెళ్ళి అక్కడ ఒక్కటి, రెండు సినిమాలు చేసుకుంటుంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె అరకు రోడ్లో అనే సినిమాతో మళ్లీ ఇక్కడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు పవన్ కొమరం పులి సినిమాపై షాకింగ్ కామెంట్లు చేసి పవన్తో పాటు అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. కొమరం పులి అమ్మడికి తొలి సినిమా..పవన్తో సినిమా అంటేనే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. కాని ఆ సినిమా తన ఇష్టంతో మాత్రం చేయలేదు అంటోంది నికిషా. ఇన్నేళ్ల.. తర్వాత తన కెరీర్ ఎక్కడికి పోతోందో అర్ధంకాక ఆమె మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచింది.
అసలు తెలుగులో తనకు సినిమా చేయడం ఆసక్తి లేదని.. బాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇద్దామని అనుకున్నానని.. దర్శకుడు ఎస్జె.సూర్య బలవంతం చేయడంతోనే పవన్తో సినిమా చేశానని ఆమె చెప్పింది. పవన్ తో కలిసి నటిస్తే చాన్స్లు వస్తాయని అందుకే తాను ఆ చిత్రం చేశానని.. ఇష్టంతో అసలు చేయలేదని చెప్పింది నికిషా. అయితే సినిమా ప్లాప్ కావడం వల్ల తనకు చాన్స్ లు రాలేదని వాపోయింది.
Related