Monday, April 29, 2024
- Advertisement -

పూరి పరిస్థితి ఎంత దారుణంగా అయిందంటే..?

- Advertisement -

పూరి జగన్నాథ్.. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్. స్టార్ హీరోలతో సినిమా చేసిన దర్శకుడు. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి గురించి మర్చిపోయి.. దమ్ములేని కథలను ఎంచుకొని.. తనకు నచ్చినట్లుగా సినిమాలు తీస్తూ వేళ్తున్నాడు పూరి జగన్నాథ్. ఇప్పుడు ఈ డైరెక్టర్ ఇరకాటంలో పడ్డాడు.

ఇంతవరకు తన బ్రాండ్ తో అవకాశాలు దక్కించికున్న పూరి.. పైసా వసూల్ తీసి.. తన ఇమేజ్ ని టోటల్ గా డ్యామేజ్ చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో పూరి తీసిన రోగ్‌, పైసా వసూల్‌ సినిమాలు చూస్తే పూరి స్థాయి చాలా తగ్గిపోయినట్లు కనబడుతోంది. ప్రతి మూవీతోను బయ్యర్లని, నిర్మాతలని నిలువునా ముంచేస్తోన్న పూరికి ఇప్పుడు నిర్మాతలు దొరకడం లేదు. పూరి తన కొడుకు ఆకాష్ ని హీరోగా ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఇడియట్ లాంటి సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి పూరి దర్శకుడుగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

ఎందుకంటే.. పూరి డైరెక్షన్ అంటే.. ఇప్పుడు నిర్మాతలు బయపడుతున్నారట. అంతే కాదు పూరి ఫోన్ చేసిన.. ఆలోచిద్దాం అని చెప్తున్నారట నిర్మాతలు. పూరినీ పూర్తిగా నిర్మాతలు ఇగ్నోర్‌ చేస్తున్నారట. మరి పూరి ఈ సారైనా.. అందరి నోళ్లు మూయించేలా పెద్ద సక్సెస్ ఇస్తాడో లేకా.. రోగ్‌, పైసా వసూల్‌ సినిమాలనే.. తన తనయుడి సినిమాని కూడా ప్లాప్ చేస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -