Sunday, April 28, 2024
- Advertisement -

ఎన్టీఆర్.. ఇంట్లో అంత పని చేశాడా..?

- Advertisement -

ఏ హీరోకి అయినా.. ఓ పాత్ర చేస్తున్నాడంటే.. అ పాత్రలో నటించడం వేరు.. ఆ పాత్రలోకి వెళ్లి.. జీవించడం వేరు. కొందరు హీరోలు.. తాము నటించిన పాత్రల్లో నుంచి బయటకి రావడానికి చాలా టైం తీసుకుంటారు. బ్యాట్ మెన్ సీరీస్ లోని జోకర్ పాత్ర ఎంత ప్రాచూర్యం పొందిందో మీ అందరికి తెలిసిందే.

ప్రపంచ సినీ చరిత్రలో బెస్ట్ విలన్ పాత్ర అంటారు దాన్ని. ఆ పాత్ర పోషించిన హీత్ లేద్జర్ ఓ నెలరోజులపాటు తన అపార్ట్మెంట్ కి తాళం వేసుకొని ఒంటరిగా గడిపాడట. ఎందుకు అంటే తనకే తెలియదు. జోకర్ లా తానూ బయటివారికి హాని చేయకూడదు, ఆ పాత్ర ప్రభావం తగ్గాకే బయటకి రావాలి అనుకున్నాడేమో. ఇలాంటి ఉదహారణలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఉదాహరణల లిస్టులోకి వచ్చి చేరాడు మన యాంగ్ టైగర్ ఎన్టీఆర్. జై లవ కుశ సినిమాలో మూడు విభిన్న పాత్రలు పోషించిన ఎన్టీఆర్ కి జై పాత్ర బాగా ఇష్టం. ఆ పాత్రలో నుంచి ఎన్టీఆర్ బయటకి రాలేకపోతున్నాడట.

ఎంతలా ఆ పాత్ర మాయలో పడిపోయాడంటే ఓరోజు రాత్రి సడెన్ గా లేచి కిటికీకి వేలాడుతూ, చంపేస్తా, చచ్చిపోతా అంటూ తనలో తానే మాట్లాడుకున్నాడట. టైంకి ఎన్టీఆర్ సతీమణి ప్రణతి నిద్రలేచి ఎన్టీఆర్ ని స్పృహలోకి తీసుకువచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పని జరిగిపోయేదో. ఈ సంగతిన్ని ఎన్టీఆర్ స్వయంగా నిన్న ఓ ప్రముఖ టీవి చానెల్ తో పంచుకున్నా, ఆ తరువాత ఎన్టీఆర్ పీఆర్ టీం ఆ ఇంటర్వ్యూని డిలీట్ చేయించడం విశేషం. ఇక జై లవ కుశ సినిమా ఈ నెల 21న విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -