Saturday, May 4, 2024
- Advertisement -

ఎపికి చిప్ప చూపించిన మోడీ….. ఆ ఛాన్స్ మిస్సవుతుందని కామెడీ చేసిన బాలయ్య

- Advertisement -

2019 ఎన్నికల్లో మోడీతో కలిసి ఎన్నికలకు వెళ్తే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి పట్టిన గతే పడుతుందని జాతీయ సర్వేలతో పాటు బాబు సొంత సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా చెప్పేయడంతో ఇప్పుడు పాపం మొత్తం మోడీపైకి నెట్టి తాను మాత్రం ప్రజల సానుభూతి పొందాలని ప్లాన్ చేస్తున్నాడు బాబు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం మొదటి దోషిగా చంద్రబాబునే చూస్తున్నారు. అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకుని…రాష్ట్రాన్ని అద్భుతంగా చేస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చిన బాబు తన చేతకానితనంతో, తన స్వార్థంతో రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశాడన్నది ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం. అయితే చంద్రబాబు మాత్రం చాలా తెలివిగా పాపం మొత్తం మోడీ అకౌంట్‌లో వేసి బయటపడాలనుకుంటున్నాడు. నిన్న జరగిన టిడిపి మీటింగ్‌లో కూడా ఇదే విషయం ఆలోచించారు. అలాగే మోడీతో కుమ్మక్కయిన జగన్ అని కూడా జనాల్లో ప్రచారం చేయాలనుకుంటున్నారు. విభజన సమయంలో సోనియాతో కుమ్మక్కయిన జగన్ అని ప్రచారం చేసి సక్సెస్ అయినట్టుగానే ఈ సారి కూడా అలాంటి ప్రయత్నమే చేయబోతున్నారు. అయితే బాబుతో సహా నాయకులందరూ కూడా ఈ విషయాలపై చర్చిస్తుంటే సడన్‌గా ఏదో చెప్పాలన్నట్టుగా లేచిన బాలయ్య చెప్పిన విషయం మాత్రం నవ్వుల పువ్వులు పూయించిందట.

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను తానే హీరోగా, తానే నిర్మాతగా బాలయ్య తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్‌కి ప్రధానమంత్రి మోడీని ఆహ్వానించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట బాలయ్య. నిన్న మీటింగ్‌లో కూడా బాలయ్య అదే విషయం చెప్పాడట. అందుకే నా సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ అయ్యేవరకూ బిజెపితో విడిపోవడం వద్దని…….. కావాలంటే ఆ తర్వాత విడిపోయినా ఒకే అని బాలయ్య చాలా సీరియస్‌గా చెప్పాడట. బాలయ్య మాటలు విన్న చంద్రబాబుతో పాటు టిడిపి సహచరులు కూడా నవ్వు ఆపుకోలేకపోయారట. అయితే బాలయ్య మాత్రం ఈ ప్రపోజల్‌ని సీరియస్‌గానే పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా మీటింగ్ అయిన తర్వాత మాత్రం చంద్రబాబుతో సహా టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపిలు, నేతలందరిదీ ఒక బాధ అయితే బాలయ్యది మాత్రం మరో వెరైటీ బాధ అయిందని టిడిపి నేతలే జోకులు వేసుకోవడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -