యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఒక వైపు బిగ్ బాస్ షో తో దూసుకెళ్తూ.. జై లవ కుశ సినిమా హిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటివలే ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎన్టీఆర్ ప్రమోషన్ బానే చేసాడు. ఈ క్రమంలో ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఎన్టీఆర్ పాతికేళ్ళ వయసులోనే రాజకీయ ప్రచారంలోకి వచ్చాడు. తన ప్రసంగాలతో జనల్ని అప్పట్లో బానే ఆకట్టుకున్నాడు. ఇక ఆ ఎన్నికల తర్వాత ఏంజరిగిందో కాని టీడీపీతో ఎన్టీఆర్ దూరం ఉంటూ వచ్చాడు. రాజకీయాలను పెద్దగా పంటించుకోలేదు. అయితే ఇప్పుడు 2009లో ఎన్నికల ప్రచారంలోకి దిగి తాను పెద్ద తప్పు చేశానని ఎన్టీఆర్ మాట్లాడటం విశేషం. భవిష్యత్తుల్లో నేను రాజకీయాల్లోకి రావొచ్చు.. రాకపోవచ్చు. ప్రస్తుతానికి నా దృష్టి సినిమాలపైనే. ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఒకవేళ మాట్లాడితే తొందరపాటు అవుతోంది.
ప్రపంచంలో ప్రతి మనిషి వెళ్తున్న దారిలోంచి కొంచెం పక్కకు వెళ్తాడు. నేను వెళ్లాను. అయితే మళ్లీ సరైన దారిలోకి రావడం నా అదృష్టం. నా ఫ్యాన్స్ వల్ల దర్శకుల వల్ల నేను వెనక్కి వచ్చాను. గతంలో చేసిన తప్పుల నుంచి చాలా నేర్చుకున్ననని తెలిపాడు ఎన్టీఆర్.