Thursday, May 2, 2024
- Advertisement -

అభిమానులను టెంక్షన్ పెడుతున్న తారక్ ?

- Advertisement -

యంగ్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీకి కమిటైన సంగతి తెలిసిందే. ” ఎన్టీఆర్ 30 ” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల ” యామిగోస్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు యంగ్ టైగర్. ఈ నెల 24 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుందని, వచ్చే ఏడాది సమ్మర్లో ఏప్రెల్ 5 న మూవీ విడుదల చేయబోతున్నట్లు తారక్ క్లారిటీ ఇచ్చారు. దీంతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. .

ఇక ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే విలన్ గా సైఫ్ అలీఖాన్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేయలేదు. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీలో స్టోరీ పరంగా తండ్రి కొడుకుల పాత్రలలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట. ఇప్పుడు ఇదే న్యూస్ ఎన్టీఆర్ అభిమానులను కలవరపెడుతుంది.

ఎందుకంటే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించిన ఆంధ్రావాలా, శక్తి వంటి సినిమాలు తారక్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. దాంతో ” ఎన్టీఆర్ 30 ” పై అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయట. అంతేకాకుండా కొరటాల శివ గత మూవీ ” ఆచార్య ” కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఈ నేపథ్యంలో కొరటాల ఎన్టీఆర్ తో చేసే సినిమాను ఎలా తీయబోతున్నారనేది అందరిలోనూ క్యూరియాసిటీని కలుగజేస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో ఎన్టీఆర్ 30 పై అభిమానుల్లో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. మరి అభిమానుల అంచనాలను ” ఎన్టీఆర్ 30 ” ప్రాజెక్ట్ ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

Also Read

సై అంటున్న రామ్ చరణ్, అల్లు అర్జున్ ?

జబర్దస్త్ రైటర్ కి నాగ్.. బంపర్ ఆఫర్ !

మెగాస్టార్ పూరీ కాంబినేషన్ ఫిక్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -