Monday, April 29, 2024
- Advertisement -

సై అంటున్న రామ్ చరణ్, అల్లు అర్జున్ ?

- Advertisement -

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దాదాపు ఎనిమిది మంది హీరోలు ఉన్న ఈ ఫ్యామిలీకి టాలీవుడ్ లో హ్యూజ్ మార్కెట్ ఉంది. ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో చిరు, పవన్ తరువాత.. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఆ స్థానంలో ఉన్నారు. వీరిద్దరికి ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉంది. వీరి సినిమాలు ఇటు తెలుగులోనూ అటు హిందీలోనూ రికార్డ్ కలెక్షను సాధిస్తూ ఉంటాయి. ” ఆర్ ఆర్ ఆర్ ” తో రాంచరణ్, పుష్ప తో అల్లు అర్జున్ అటు నార్త్ లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేశారో అందరం చూశాం. అలాంటి ఈ ఇద్దరి మెగాహిరోల సినిమాలు ఒకేసారి విడుదల అయితే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. అయితే అది జరుగుతుందా అంటే జరిగే అవకాశం ఉండని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి..

ప్రస్తుతం రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే సగభాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ” పుష్ప 2 ” మూవీని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో వచ్చే ఏడాది పొంగల్ రేస్ లో బావ బామార్ధుల పొరు కన్ఫర్మ్ అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇద్దరు ఒకే ఫ్యామిలీకి చెందిన వారు కావడంతో బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు రెడీగా ఉంటారా అనేది సందేహమే. అయితే సంక్రాంతి అనేది టాలీవుడ్ సినిమాలకు అతి పెద్ద సీజన్ కావడంతో అల్లు అర్జున్, రామ్ రాంచరణ్ ఒకే సారి బరిలోకి దిగిన ఆశ్చర్యం లేదు. మరి చూడాలి ఈ ఇద్దరి మెగా హీరోల రసవత్తరమైన పొరు ఎలా ఉండబోతుందో అనేది.

ఇవి కూడా చదవండి

అందం మార్చుకున్న హీరోయిన్స్ వీరే!!

ఎన్టీఆర్ కోసం ప్లాన్ మార్చిన కొరటాల !

క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన సెలబ్రిటీలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -