టాలీవుడ్ క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటించిన “లవ్ స్టోరీ” మూవీ కరోనా వ్యాప్తి కారణంగా విడుదల తేదీని మార్చుకోవడం జరిగింది.
తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వైవిధ్యభరితమైన యూత్ ఫుల్ కథాంశంతో సాగే సినిమాలో నటించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాను శేఖర్ కమ్ముల తెలుగు, తమిళ్,హిందీ భాషలో ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై రూపొందనున్న ఈ సినిమాకు నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
Also read:అదృష్టంతో బతికిపోయానంటున్న స్టార్ నటుడు.. ఎవరంటే?
శేఖర్ కమల, హీరో ధనుష్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ దాదాపుగా ఖరారు అయిందని చెప్పవచ్చు. ఇక ఈసినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ధనుష్ హీరోగా బాలీవుడ్ లో “అత్రాంగిరే”అలాగే హాలీవుడ్లో “దిగ్రేమ్యాన్” వంటి భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మూవీ చేయడానికి ఓకే చెప్పేశాడు. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
Also read:మరోసారి నగ్నంగా రెచ్చిపోయిన కియారా.. ఫోటోలు చూస్తే?