Tuesday, April 30, 2024
- Advertisement -

చిరు కోసం లక్ష బీర్ బాటిళ్లు!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ అడ్వెంచర్ విశ్వంభర. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా హైదరాబాద్‌లో కీలకమైన యాక్షన్ షెడ్యూల్‌ను ప్రారంభించారు.

ఈ షెడ్యూల్‌కి సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని శివారు ప్రాంతంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో లక్ష బీర్ బాటిళ్లతో ప్రత్యేకమైన సెట్‌ వేశారు. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ కోసం చిరు తెగ కష్టపడుతున్నారట.

భారీ స్థాయిలో షూట్ చేస్తున్న ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌గా ఉండనుందని సమాచారం. కీరవాణి ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా శివశక్తి దత్తా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -