ఇటివలే టాలీవుడ్ లో అవార్డుల గొడవ ఎక్కువైయింది. కొందరు హీరోల అభిమానులు తమ హీరోని కావాలనే తొక్కేస్తున్నారని అంటున్నారు. అయితే ఇటివలే జరిగిన సైమా అవార్డుల వేడుకలో స్పెషల్ క్యాటగిరీలో అవార్డుల ఎంపిక విషయంపై ఇప్పుడు ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వివాదానికి కారణమైంది. అయితే ఆ ఇద్దరు హీరోలు మెగా ఫ్యామిలీకి చెందినవారే అవ్వడం విశేషం.
ఈ సైమా అవార్డుల వేడుకలో రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు గాను అల్లు అర్జున్ కి అవార్డు వచ్చింది. ఈ అవార్డు ను కూడా ఎలాంటి పోటీ లేకుండా ప్రకటించేశారు. దీంతో అసలై అల్లు అర్జున్ మీద కోపంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ 2015 లో ‘గోపాల గోపాల’ చిత్రంలో పవన్ కళ్యాణ్ చక్కటి నటన కనబరిచారు. అలాంటి చిత్రాన్ని కనీసం పోటీకి కూడా తీసుకోకుండా అల్లు అర్జున్ కి అవార్డు ఇవ్వడంపై పవన్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు.
కావాలనే అల్లు అర్జున్ ని హైలేట్ చేయడం కోసం పవన్ ను తొక్కేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు. బన్నీని కావాలనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్పై బన్నీ చేసిన చెప్పను బ్రదర్ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పవన్ అభిమానులకు అల్లు అర్జున్ అంటే పడటం లేదు. దీంతో తాజాగా జరిగిన సైమా అవార్డులు ఎంపిక వారికి మరింత చిర్రెత్తుకొచ్చేలా చేసింది.
Related