టాలీవుడ్ లో రోజు రోజుకు చాలా మార్పులు వస్తున్నాయి. మొదట టాలీవుడ్ పరిశ్రమ అంటే చాలా చిన్నది అని, అక్కడి నటులకు పారితోషకం తక్కువ అని చెప్పుకుంటే.. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో రెమ్యునరేషన్ బాలీవుడ్ స్థాయిని తలపిస్తుంది. అప్పట్లో సినిమాలో నటించినవారికి షూటింగ్ కంప్లీట్ అయ్యాక.. సినిమా హిట్ అయితే అందులోనుంచి డబ్బు ఇచ్చేవారు.
కాని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో చాలా మార్పు వచ్చాయి. ప్రజలను ఎక్కువగా ఆకర్షించే నటులకు ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉంది. అలానే మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారిలో మహేష్ అందరికంటే ముందున్నారు. త్వరలో మురగదాస్, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రానికి మహేష్ కు 20 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ ప్లేస్ను పవన్కల్యాణ్ ఆక్రమించాడని వార్తలు వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్తో త్వరలో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం పవన్ 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. దీని తర్వాత మైత్రీ మూవీస్కు పవన్ మరో సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా అయితే ఏకంగా 40 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట. ఈ సినిమాకు 40 రోజుల కాల్షీట్లు ఇచ్చాడు. దీనిని బట్టి రోజుకు కోటి తీసుకుంటున్నట్టు లెక్క. అబ్బో పవర్ స్టార్ చాలా ఖరీదైపోయారని అనుకుంటున్నారు సినీ జనాలు.
{youtube}0kpYokyy92I{/youtube}
{youtube}ta2d3gicffc{/youtube}
Related