‘డీజే’ సినిమా వల్ల.. టాలీవుడ్లో హాట్ ప్రాపర్టీగా మారిపోయింది పూజా హెగ్డే. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇక ఓ ఊపు ఊపేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. తాజాగా విడుదలైన గుడిలో బడిలో పాటలో అందాలతో బంధాలు వేసి ఆడియన్స్ను కట్టిపడేసింది ఈ కన్నడ భామ.
{loadmodule mod_custom,GA1}
అలానే ఇటివలే రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా గ్లామర్ ను ఓ రెంజ్ లో చూపించి కుర్రకారును రెచ్చగొడుతుంది. గతంలో వచ్చిన ‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ చిత్రాల్లో కాస్తంత పద్ధతగా కనిపించిన పూజ.. ‘డీజే’లో మాత్రం గ్లామర్ ట్రీట్ ఇవ్వబోతోందని అర్థం అయింది. టాలీవుడ్కు అమ్మడి రూపంలో మరో గ్లామరస్ బ్యూటీ దొరికిందని మురిసిపోయారు. కానీ, పూజ ఆలోచనలు మాత్రం బాలీవుడ్ చుట్టూనే తిరుగుతున్నాయట. అందుకే తెలుగు నాట ఆఫర్లు వెల్లువెత్తుతున్నా అమ్మడు తొందరపడటంలేదట. తెలుగులో రెండు సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్ లో ‘మొహెంజోదారో’ చేసింది పూజ.
{loadmodule mod_custom,GA2}
ఈ సినిమా ఊహించని రెంజ్ లో అట్టర్ ప్లాప్ కావడంతో.. అమ్మడు తిరిగి టాలీవుడ్కు వచ్చింది. కెరీర్ పరంగా గ్యాప్ రాకూడదని డీజే లో నటించిన పూజ ఫ్యూచర్ మాత్రం బాలీవుడ్లోనే రాణించాలని తపన పడుతోందట. అందుకే డీజే కంప్లీట్ అయ్యాక వెంటనే ముంబై చెక్కేయ్యాలని ఫిక్స్ అయిందట ఈ అందాల భామ. మరి ఈ ముకుంద భామ కోరిక ఎంత వరకూ నెరవేరుతుందో చూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}FplXAQSEMxY{/youtube}
Related