అల్లు అర్జున్ హీరోగా.. హరిష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా డీజే(దువ్వాడ జగన్నాథం). ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్, సాంగ్స్ కి మంచి స్పందన వస్తోంది. ఈ రెండు పాటల్లో హీరో హీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. అయితే ఈ రెండు పాటల్లో హీరో హీరోయిన్పై సాగే గీతంపై వివాదం నెలకొనడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
{loadmodule mod_custom,GA1}
డీజే టీజర్ను డిజ్లైక్ల వివాదం చుట్టుమట్టడంతో ట్రైలర్ ఎలా ఉంటుందోనని బన్నీ ఫ్యాన్స్తో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీజే సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. డీజే(దువ్వాడ జగన్నాథం) సినిమా జూన్ 23న థియేటర్లలో సందడి చేయబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈ రోజే రిలీజ్ అయింది. ట్రైలర్ లో అల్లు అర్జున్ రెండు విభిన్న గెటప్ లో కనిపించాడు. ఒక పాత్రలో బ్రహ్మణి పాత్రలో.. మరోక పాత్ర స్టైలీష్ గా కనిపించాడు.
{loadmodule mod_custom,GA2}
అల్లు అర్జున్ చెప్పిన “ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్ఛామి కాదు సార్ . యుద్ధం శరణం గచ్ఛామి” అనే డైలాగ్ చాలా బాగుంది. హీరోయిన్ పూజ హిగ్దే.. గ్లామర్ గా కనిపించింది. అలానే విలన్ గా రావు రమేష్ నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగితం బాగుంది. దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి. డైరెక్ట హరిష్ శంకర్ కూడా ఈ సినిమాతో హిట్ కొట్టేలా ఉన్నాడు. మొత్తంగా చూస్తుంటే.. సినిమాలో మంచి కంటేంట్ ఉంది అని కనిపిస్తోంది. ఏది ఏమైన వరస హిట్స్ తో వెళ్తున్న.. అల్లు అర్జున్ ఈ సినిమాతో హిట్ కొట్టేలా ఉన్నాడు.
{youtube}fy-kooz9se4{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related